న్యూఢిల్లీ: ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ (ITBP) విభాగంలో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తికలిగినవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోచ్చు. అయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈనెల 23 నుంచి ప్రారంభంకానున్నది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 287 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందలో కానిస్టేబుల్, ట్రేడ్స్మెన్ పోస్టులు ఉన్నాయి. పదోతరగతి ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టులు: 287
కానిస్టేబుల్ టైలర్ 18, గార్డెనర్ 16, కోబ్లర్ 31, సఫాయి కర్మచారి 78, వాషర్మ్యాన్ 89, బార్బర్ 55 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణులై, 18 నుంచి 25 ఏండ్లలోపు వయస్సు ఉన్నవారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: దేహదారుఢ్య పరీక్ష, రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.100, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఎక్స్సర్వీస్మ్యాన్ ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తులు ప్రారంభం: నవంబర్ 23
దరఖాస్తులకు చివరితేదీ: 2022, డిసెంబర్ 22
వెబ్సైట్: recruitment.itbpolice.nic.in