న్యూఢిల్లీ: ఇండియన్ నేవీలో ట్రేడ్స్మెన్ స్కిల్డ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని ఇండయన్ నేవీ సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈ నెల 22 నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1531 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో గ్రూప్ సీ, నాన్ గెజెటెడ్ పోస్టులు ఉన్నాయి. పదో తరగతి పాసైనవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేయనుంది.
మొత్తం పోస్టులు: 1531
అర్హతలు: పదో తరగతి పాసై సంబంధిత ట్రేడ్లో ఐటీఐ చేసి ఉండాలి. ఇంగ్లిష్లో కనీస పరిజ్ఞానం ఉండాలి. అభ్యర్థులు 25 ఏండ్లలోపు ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: ఫిబ్రవరి 22 నుంచి
దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 31
వెబ్సైట్: www.joinindiannavy.gov.in