న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న పోస్ట్ ఆఫీసుల్లో 40,889 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి తపాలా శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. అర్హత కలిగినవారు వచ్చేనెల 16లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోచ్చు. పదోతరగతి పూర్తిచేసినవారు అర్హులు. మొత్తం 40,889 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో బ్రాంచ్ పోస్టు మాస్టర్ లేదా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టుమాస్టర్ ఉద్యోగాలు ఉన్నాయి. వీటిలో తెలంగాణలో 1266, ఆంధ్రప్రదేశ్లో 2480 పోస్టులు ఉన్నాయి. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టులు: 40,889
సర్కిళ్లవారీగా.. తెలంగాణలో 1266, ఆంధ్రప్రదేశ్లో 2480, అసోంలో 407, బీహార్ 1461, ఢిల్లీ 46, ఛత్తీస్గఢ్ 1593, గుజరాత్ 2017, హర్యానా 354, హిమాచల్ప్రదేశ్ 603, జమ్ముకశ్మీర్ 300, జార్ఖండ్ 1590, కర్ణాటక 3036, కేరళ 2462, మధ్యప్రదేశ్ 1841, మహారాష్ట్ర 2508, నార్త్ ఈస్టర్న్ 923, ఒడిశా 1382, పంజాబ్ 766, రాజస్థాన్ 1684, తమిళనాడు 3167, ఉత్తరప్రదేశ్ 7987, ఉత్తరాఖండ్ 889, పశ్చిమ బెంగాల్ 2127 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత సాధించి కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. సైకిల్ తొక్కడం రావాలి. అభ్యర్థులు 18-40 ఏండ్ల మధ్యలో ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 16
వెబ్సైట్: www.indiapostgdsonline.gov.in