IIT Madras Admissions 2023 | ఐఐటీలు ఇంజినీరింగ్ విద్యకు పేరుగాంచిన సంస్థలు. అందులో ఐఐటీ మద్రాస్కు క్రేజ్ ఎక్కువ. దేశంలో ఐదేండ్లుగా టాప్ ర్యాంకింగ్లో నిలుస్తుంది ఐఐటీ మద్రాస్. ఈ సంస్థలో చదవాలంటే సాధారణంగా జేఈఈ మెయిన్స్ రాసి దాని తర్వాత అడ్వాన్స్డ్లో మంచి ర్యాంక్ సాధించాలి. కానీ నాణ్యమైన విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంతో పాటు వేగంగా విస్తరిస్తున్న కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్, వాటి అనుబంధ పరిశ్రమలకు అవసరమయ్యే నిపుణులను తయారు చేయడానికి నేరుగా ఆన్లైన్లో డిగ్రీ కోర్సులను అందిస్తుంది ఐఐటీ మద్రాస్. ఇప్పటికే బీఎస్సీ డేటా సైన్స్ ద్వారా సుమారు 17 వేల మందికి ప్రవేశాలు కల్పించింది. ఈ ఏడాది నుంచి బీఎస్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ కోర్సును అందిస్తుంది. ఈ కోర్సులో చేరడానికి అర్హతలు, కోర్సులో నేర్చుకునే అంశాలు, ఫీజు తదితర వివరాలు నమస్తే తెలంగాణ పాఠకుల కోసం…
ఐఐటీ మద్రాస్
రెండు డిగ్రీలు చదవచ్చు!
– కేశవపంతుల వేంకటేశ్వరశర్మ