న్యూఢిల్లీ: దేశంలోని ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీల్లో (IIT) ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ (JEE Advanced) పరీక్ష వచ్చే నెల 4న జరుగనుంది. ఈ ప్రవేశపరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను (Admit cards) ఐఐటీ గువాహటి (IIT Guwahati) విడుదల చేసింది. అధికార వెబ్సైట్ www.jeeadv.ac.in.లో అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. జూన్ 4 వరకు (June 4) అవి అందుబాటులో ఉంటాయని పేర్కొంది.
ఈ ప్రవేశ పరీక్షను (Examination) జూన్ 4న రెండు సెషన్లలో నిర్వహిస్తారు. మొదటి సెషన్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉంటుంది. ఈ పరీక్షకోసం దేశవ్యాప్తంగా దాదాపు 1.9 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. వారిలో 1.46 లక్షల మంది అబ్బాయిలు ఉండగా, 44 వేల మంది బాలికలు ఉన్నారు.