హైదరాబాద్ : ఎంబీఏ ప్రవేశాల దరఖాస్తుల గడువును హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ( HCU ) పొడిగించింది. ఎంబీఏ దరఖాస్తుల గడువు ఫిబ్రవరి 15 వరకు పొడిగించింది. డిగ్రీ చివరి ఏడాది విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని హెచ్సీయూ అధికారులు పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు http://acad.uohyd.ac.in/ వెబ్సైట్ను సందర్శించొచ్చు.