హైదరాబాద్: డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే దోస్త్ (DOST) స్పెషల్ ఫేజ్ వెబ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభంకానున్నది. ఈ నెల 20 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. 24న సీట్లు కేటాయించనున్నారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి షెడ్యూల్ విడుదల చేసింది. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే విద్యార్థులు రూ.400 చెల్లించాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి తెలిపారు.
అదేవిధంగా గతంలో సీటు వచ్చినా చేరనివారు కూడా రూ.400 చెల్లించాలన్నారు. ఈనెల 24న స్పెషల్ ఫేజ్ విడత సీట్లను కేటాయిస్తామన్నారు. సీట్లు పొందినవారు 26 వరకు కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సూచించారు. కోర్సు లేదా మీడియం మారాలనుకునే వారు ఈనెల 27 నుంచి 29 వరకు ఆప్షన్లు ఇచ్చుకోవాలన్నారు. ఇంకా 2,19,693 సీట్లు ఖాళీగా ఉన్నాయని చెప్పారు.