హైదరాబాద్ : రెగ్యులర్ పదితో పాటు ఓపెన్ టెన్త్, వొకేషన్ పబ్లిక్ ఎగ్జామ్ ఫీజు స్వీకరణ గడువును గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ డైరెక్టరేట్ పొడిగించింది. ఏప్రిల్, మే 2022లో టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. అర్హత గల విద్యార్థులు ఫిబ్రవరి 14వ తేదీ వరకు ఫీజు చెల్లించొచ్చు అని అధికారులు తెలిపారు.
ఆలస్య రుసుం రూ. 50తో ఫిబ్రవరి 24 వరకు, రూ. 200తో మార్చి 4వ తేదీ వరకు ఫీజు చెల్లించొచ్చు. ఆలస్య రుసుం రూ. 500తో మార్చి 14వ తేదీ వరకు ఫీజు చెల్లించొచ్చు అని అధికారులు స్పష్టం చేశారు. తదితర వివరాల కోసం https://www.bse.telangana.gov.in వెబ్సైట్ను సంప్రదించొచ్చు.