ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ దూర విద్యా కేంద్రమైన ప్రొఫెసర్ జి రామిరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (పీజీఆర్ఆర్ సీడీఈ) ద్వారా అందించే డేటా సైన్స్ డిప్లొమా కోర్సుల పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్ కు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ డేటా సైన్స్, అడ్వాన్స్ డిప్లొమా ఇన్ డేటా సైన్స్ కోర్సుల మెయిన్, బ్యాక్ లాగ్ పరీక్ష ఫలితాలను ఇప్పటికే విడుదల చేశామని చెప్పారు.
రివాల్యుయేషన్ కోసం ఒక్కో పేపర్కు రూ.800 చొప్పున చెల్లించి ఈ నెల 22వ తేదీలోగా టీఎస్ ఆన్లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. రూ.200 అపరాధ రుసుముతో 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జవాబు పత్రాల నకలు పొందగోరువారు ఒక్కో పేపర్ కు రూ. 1000 చొప్పున చెల్లించి 22వ తేదీ వరకు తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్లో చూసుకోవచ్చని సూచించారు.