హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ అడ్మిషన్ల తొలి ఫేజ్లో అభ్యర్థులకు సీట్లు అలాట్ చేసింది. వీరందరూ వర్సిటీలో సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సిన గడువును పొడిగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీపీజీఈటీ-2021 కన్వీనర్ ఒక ప్రకటన చేశారు.
తొలి విడతలో సీట్లు అలాట్ చేసిన అభ్యర్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ తేదీని ఈ నెల 15 వరకూ పొడిగిస్తున్నట్లు ఈ ప్రకటనలో తెలిపారు. దీనిపై మరింత సమాచారం కోసం యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్లు www.ouadmissions.com లేదా www.osmania.ac.in లో చెక్ చేసుకోవాలని సూచించారు.