న్యూఢిల్లీ: కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) వివిధ విభాగాల్లో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 22 వరకు అందుబాటులో ఉంటాయి. మొత్తం 1050 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో మైనింగ్, సివిల్, ఎలక్ట్రానిక్ అండ్ టెలికమ్యూనికేషన్, సిస్టమ్ అండ్ ఈడీపీ విభాగాలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. గేట్-2022లో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
మొత్తం పోస్టులు: 1050
ఇందులో మైనింగ్ 699, సివిల్ 160, ఎలక్ట్రానిక్ అండ్ టెలికమ్యూనికేషన్ 124, సిస్టమ్ అండ్ ఈడీపీ 67 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత విభాగంలో బీటెక్, బీఎస్సీ ఇంజినీరింగ్, ఎంసీఏ 60 మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక ప్రక్రియ: గేట్-2022లో వచ్చిన మార్కుల ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.1180, ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులకు చివరితేదీ: జులై 22
వెబ్సైట్: www.coalindia.in.