న్యూఢిల్లీ: ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) టర్మ్-1 బోర్డు పరీక్షలు రేపటి నుంచి (మంగళవారం) ప్రారంభం కానున్నాయి. ఓఎమ్మార్ విధానంలో CBSE ఈ పరీక్షలను నిర్వహించనున్నది. ఓఎమ్మార్ షీట్లలో బబుల్స్ను ఫిల్ చేయడానికి విద్యార్థులు బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను తీసుకుని రావాలని CBSE అధికారులు తెలిపారు. విద్యార్థులు పరీక్ష హాల్కు తప్పనిసరిగా CBSE టర్మ్-1 అడ్మిట్ కార్డు తీసుకుని రావాలని సూచించారు.
ఒకవేళ విద్యార్థులు ఏదైనా బబుల్ను తప్పుగా ఫిల్ చేసి ఉంటే.. ఆ నాలుగు సర్కిళ్లకు ముందు ఇచ్చిన బాక్స్లో కరెక్ట్ జవాబు రాయవచ్చని పరీక్ష నిర్వాహకులు తెలిపారు. అయితే ఆ బాక్సును రబ్బింగ్ చేయకూడదని, అందులో ఎ, బి, సి, డి ఆప్షన్లలో ఏది కరెక్టు అయితే ఆ లెటర్ను రాయాలని సూచించారు. విద్యార్థులు బాక్సులో రాసిన జవాబునే CBSE తుది జవాబుగా పరిగణిస్తుందని చెప్పారు.