ఉపాధ్యాయుడిగా రాణించడానికి, కాలానుగుణంగా బోధనారంగంలో మారుతున్న వ్యూహాలు, సవాళ్లు ఎదుర్కోవడానికి అవసరమైన ప్రతిభ, సామర్థ్యాలు, బోధన నైపుణ్యాలు ఏ మేరకు కలిగి ఉన్నారో తెలుసుకునేందుకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహిస్తారు. ఈ పరీక్ష పేపర్-1, పేపర్-2 అని రెండు రకాలుగా ఉంటుంది. D.Ed అభ్యర్థులు టెట్ పేపర్-1, B.Ed అభ్యర్థులు టెట్ పేపర్-1తోపాటు పేపర్-2 రాయడానికి అర్హులు. ఈ పరీక్షల్లో అర్హత మార్కులు సాధించిన వారిని ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకం కోసం జరిగే పరీక్షలకు అనుమతి ఇస్తారు. కాబట్టి అభ్యర్థులు కచ్చితమైన ప్రణాళికను రూపొందించుకుని చదివితే తప్పక విజయం సాధించవచ్చు.
పేపర్-2లో అర్హత సాధించాలంటే శిశు అభివృద్ధి, బోధనా పద్ధతులు, ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, సోషల్ కంటెంట్ బాగా చదవాలి. సిలబస్లో పేర్కొన్న ప్రకారం 3 నుంచి 10 తరగతుల సోషల్ పాఠ్యపుస్తకాలను సేకరించాలి. అదేవిధంగా తెలుగు అకాడమీ వారి సాంఘిక శాస్త్రం మెథడాలజీ పుస్తకం చదవాలి. అదేవిధంగా తెలుగు అకాడమీ వారి ఇంటర్మీడియట్ భూగోళ శాస్త్రం, అర్థ శాస్త్రం, చరిత్ర, రాజనీతి శాస్త్రం విషయాలను కూడా విస్తృత అవగాహన కోసం అధ్యయనం చేయాలి.
సాధన ఎలా..?