హైదరాబాద్: బీసీ సంక్షేమ గురుకులాల్లో 6, 7, 8వ తరగతిలో ఖాళీ సీట్ల భర్తీకి ఈ నెల 19న ప్రవేశపరీక్ష (Entrance exam) నిర్వహించనున్నారు. విద్యార్థులు తమ హాల్టికెట్లను http://mjptbcwreis.telangana.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. బీసీ గురుకులాల్లో మొత్తం 2,752 సీట్లు ఖాళీగా ఉండగా, 87,312 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఏమైనా సందేహాలుంటే 040–23322377, 23328266 సంప్రదించవచ్చని సూచించారు.