హైదరాబాద్: ప్రభుత్వరంగ సంస్థ అయిన మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని)లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూకి హాజరుకావాలని కోరింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 21 పోస్టులను భర్తీ చేస్తున్నది. కేవలం ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఎంపికైనవారు హైదరాబాద్లో పనిచేయాల్సి ఉంటుంది.
పోస్టుపేరు: అసిస్టెంట్ మెటల్లర్జీ
మొత్తం పోస్టులు: 21 (జనరల్ 8, ఈడబ్ల్యూఎస్ 2, ఓబీసీ 6, ఎస్సీ 3, ఎస్టీ 2)
అర్హతలు: మెటల్లర్జికల్ ఇంజినీరింగ్లో 60 శాతం మార్కులతో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత రంగంలో ఏడాదిపాటు పనిచేసిన అనుభవం ఉండాలి. 2021, ఏప్రిల్ 4 నాటికి 35 ఏండ్లలోపు వారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా
అడ్రస్: బ్రహ్మ్ప్రకాశ్ డేఏవీ స్కూల్, మిధాని టౌన్షిప్, హైదరాబాద్
ఇంటర్వ్యూ తేదీ: జూన్ 21న
వెబ్సైట్: https://midhani-india.in/