న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని నేషనల్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ (ఎన్బీఈ) ఇన్ మెడికల్ సైన్సెస్లో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేయనున్నారు.
మొత్తం ఖాళీలు: 42
ఇందులో సీనియర్ అసిస్టెంట్ 8, జూనియర్ అసిస్టెంట్ 30, జూనియర్ అకౌంటెంట్ 4 చొప్పున పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఎన్బీఈ నిర్వహించే పరీక్షలో అర్హత సాధించాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. కంప్యూటర్ బేసిక్ సాఫ్ట్వేర్ (విండోస్/ నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టం/ల్యాన్)పై అవగాహన ఉండాలి. అభ్యర్థులు 27 ఏండ్లలోపువారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, కంప్యూటర్ స్కిల్ టెస్ట్ ద్వారా
పరీక్షా విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్
అప్లికేషన్ ఫీజు: రూ. 1500, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తులు ప్రారంభం: జూలై 15
దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 14
సీబీటీ పరీక్ష తేదీ: సెప్టెంబర్ 20
వెబ్సైట్: www.natboard.edu.in