న్యూఢిల్లీ, మే 9: వివిధ దేశాలు 6,738 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, 3,856 సిలిండర్లు, 16 ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు, 3 లక్షల రెమ్డెసివిర్ సీసాలను సాయంగా అందించాయని కేంద్రప్రభుత్వం వెల్లడించింది. వీటిని ఏప్రిల్ 27-మే 8వ తేదీల మధ్య రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం తెలిపింది. కరోనా నియంత్రణకు విదేశాలు అందించే సాయాన్ని స్వీకరించాలని భారత ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. గత నెల 27 నుంచి విదేశీ విరాళాలు, సాయాన్ని స్వీకరిస్తున్నారు.