కరోనా వైరస్ నివారణ కోసం కొమురవెల్లి మల్లికార్జునస్వామి క్షేత్రంలో ఆదివారం లక్ష్మి గణపతి హోమం, మృత్యుంజయ హోమం, ధన్వంతరి హోమాలను నిర్వహించారు. ఆలయ ఈవో ఏ బాలాజీ ఆధ్వర్యంలో ఆలయ ప్రధానార్చకులు మహాదేవుని మల్లికార్జున్, అర్చకులు హోమం చేపట్టారు. అనంతరం ఈవో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణతోపాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని స్వామివారిని వేడుకున్నట్టు తెలిపారు.
-చేర్యాల