Zimbabwe Cricket : జింబాబ్వే క్రికెట్ బోర్డు ఇద్దరు ఆటగాళ్లపై నిషేధం విధించింది. డోప్ పరీక్షలో పట్టుబడిన ఆల్రౌండర్లు వెస్లీ మధేవెరె(Wessly Madhevere), బ్రాండన్ మవుతా(Brandon Mavuta)లపై నాలుగు నెలల నిషేధం విధిస్తూ ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు వీళ్ల మూడు నెలల జీతంలో సగం కోత వేయనున్నట్టు తెలిపింది. జనవరి నుంచి అమలులోకి వస్తుందని బోర్డు వెల్లడించింది.
డోప్ పరీక్షలో దొరికిపోయిన మరో ఆటగాడు కెవిన్ కసుంజా(Kevin Kasuza)ను ఇప్పటికే అన్ని క్రికెట్ కార్యకలాపాల నుంచి తప్పించారు. అతడు త్వరలోనే క్రమశిక్షణ కమిటీ ముందు హాజరుకానున్నాడు. ఆ తర్వాతే అతడిపై నిషేధం విధించే అవకాశం ఉంది.
ZC bans Madhevere, Mavuta as Kasuza also fails drug test
Details 🔽https://t.co/6ncmtJiGer pic.twitter.com/3Ww19hD4ph
— Zimbabwe Cricket (@ZimCricketv) January 25, 2024
‘ప్రస్తుతం వెస్లీ, మవుతా లు రిహాబిలిటేషన్లో ఉన్నారు. అక్కడ ఈ ఇద్దరినీ జింబాబ్వే క్రికెట్ వైద్య సిబ్బంది పర్యవేక్షించనున్నారు. అక్కడ ఈ ఇద్దరు క్రికెటర్లు కఠినమైన శిక్షణ తీసుకుంటారు. ఇప్పటికే వీళ్లు ఆ నిషేధిత డ్రగ్ను వాడడం మానేశారు. అందకని వాళ్లపై కొన్ని నెలలు మాత్రమే నిషేధం విధించాం’ అని జింబాబ్వే క్రికెట్ ఓ ప్రకటనలో తెలిపింది.
కెవిన్ కసుంజా
వెస్లీ జింబాబ్వే తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి 98 మ్యాచ్లు ఆడాడు. ఈ ఆల్రౌండర్ స్వదేశంలో డిసెంబర్ 10న ఐర్లాండ్(Ireland)తో చివరి టీ20 ఆడాడు. ఇక యంగ్స్టర్ మవుతా మాత్రం 26 వన్డే మ్యాచుల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడంతే. యువ బ్యాటర్ కెవిన్ విషయానికొస్తే ఏడు టెస్టులు ఆడాడు.