హరారే: జింబాబ్వేతో జరుగుతున్న తొలి వన్డేలో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. టాస్ గెలిచిన ఇండియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నది. అయితే దీపక్ చాహార్ ఆరంభంలోనే ఇద్దరు ఓపెనర్లను ఔట్ చేశాడు. జింబాబ్వే 17 ఓవర్లు పూర్తి అయ్యే వరకు 5 వికెట్లు కోల్పోయి 72 రన్స్ చేసింది. చాహర్ ఖాతాలో మూడు వికెట్లు పడగా, సిరాజ్, ప్రసిద్ధ్లు చెరో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్కు ఇండియా సారథిగా కేఎల్ రాహుల్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. సికందర్ రాజా 12 రన్స్ చేసి ఔటయ్యాడు. రేగిస్ చాకబ్వా 24 రన్స్తో క్రీజ్లో ఉన్నాడు.