హైదరాబాద్ : తెలంగాణలో త్వరలో నూతన రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు వైఎస్ షర్మిల ఇప్పటికే ప్రకటించారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేయనున్నది ఇవాళ ఆమె స్పష్టతనిచ్చారు.
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి తాను పోటీచేయనున్నట్లు షర్మిల ప్రకటించారు. హైదరాబాద్లో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తన ప్రభంజనాన్ని ఆపలేరని అన్నారు.
తెలంగాణ ప్రజలు తనకు అన్నివిధాలా మద్దతుగా నిలుస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. వైఎస్కు పులివెందుల ఎలాగో.. తనకు ఖమ్మం జిల్లా అలాగే అని ఆమె వ్యాఖ్యానించారు.
వచ్చే నెల 9వ తేదీన ఖమ్మంలో నిర్వహించబోతున్న భారీ బహిరంగసభలో తన పార్టీ పేరును ఆమె ప్రకటించనున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి