శంకర్పల్లి మే 26 : నేటి యువత స్వయం ఉపాధితో ఎదగాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మహలింగాపురం గ్రామంలో ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి హార్డ్వేర్ షాప్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్యోగాలపై ఆధారపడకుండా వ్యాపార రంగాలలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం శంకర్పల్లి లో పలు వివాహలకు హజరై వధూవరులను ఆశీర్వాదించారు.
ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి గోవిందమ్మ, మున్సిపల్ చైర్పర్సన్ సాత విజయలక్ష్మి , వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు వాసుదేవ్ కన్నా, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు,ఉపాధ్యక్షుడు గోపాల్, రాఘవేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.