IND vs ENG 3rd Test : రాజ్కోట్ టెస్టులో భారత జట్టు భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. కుర్రాళ్లు దంచికొడుతుండడంతో నాలుగొందలకు పైగా ఆధిక్యం సాధించింది. మూడోరోజు రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగిన యశస్వీ జైస్వాల్ (149 నాటౌట్) నాలుగో రోజు కూడా రఫ్ఫాడిస్తున్నాడు. మరో ఎండ్లో అరంగేట్రం బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్(22 నాటౌట్) దంచికొడుతున్నాడు. దాంతో, భారత జట్టు లంచ్ బ్రేక్ వరకు 4 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. ప్రస్తుతానికి రోహిత్ సేన 440 రన్స్ ఆధిక్యంలో ఉంది.
ఓవర్నైట్ స్కోర్ 196/2 తో నాలుగోరోజు ఆట కొనసాగించిన భారత్ తొలి సెషన్లో రెండు వికెట్లు కోల్పోయింది. మూడో రోజు ఎంతో ఓపికగా ఆడిన శుభ్మన్ గిల్(91) చేజేతులా సెంచరీ మిస్ చేసుకున్నాడు. నైట్ వాచ్మన్ కుల్దీప్ యాదవ్(26)తో సమన్వయ లోపంతో అతడు రనౌట్గా వెనుదిరిగాడు.
It’s Lunch on Day 4 in Rajkot!
Adding 118 runs to the overnight score, #TeamIndia have moved to 314/4 🙌
Stay Tuned for Second Session ⌛️
Scorecard ▶️ https://t.co/FM0hVG5pje#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/ZdjDxl3kWJ
— BCCI (@BCCI) February 18, 2024
ఆ కాసేపటికే కుల్దీప్ను రెహాన్ అహ్మద్ పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత యశస్వీతో జత కలిసిన సర్ఫరాజ్ ధాటిగా ఆడాడు. వీళ్లిద్దరూ ఐదో వికెట్కు 62 బంతుల్లోనే 56 పరుగులు జోడించారు. దాంతో, రోహిత్ సేన భారీ ఆధిక్యం సాధించింది. లంచ్ తర్వాత ఎప్పుడు ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తాడు అనేది చూడాలి. చూస్తుంటే.. ఈ టెస్టులో ఇంగ్లండ్ డ్రా కోసం పోరాడక తప్పని పరిస్థితి నెలకొంది.