Ravichandran Ashwin : రాజ్కోట్ టెస్టులో పటిష్టస్థితిలో నిలిచిన టీమిండియాకు గుడ్న్యూస్. సీనియర్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) జట్టుతో కలువనున్నాడు. ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా అర్థాంతరంగా చెన్నైకి వెళ్లిన అశ్విన్.. నాలుగో రోజు జట్టుతో కలుస్తాడని బీసీసీఐ తెలిపింది. ‘నాలుగో రోజు అశ్విన్ జట్టుతో కలుస్తాడు. అతడు ఎల్లప్పుడూ టీమిండియాకు తన సేవలందించేందుకు ముందుంటాడు’ అని బీసీసీఐ అంది.
అశ్విన్ అమ్మ చిత్రకు ఆరోగ్యం బాగాలేదు. ఈ విషయం తెలియడంతో అతడు శుక్రవారం హుటాహుటిన రాజ్కోట్ నుంచి చెన్నైకి బయలేదేరాడు. ప్రస్తుతం అశ్విన్ తల్లి అరోగ్యం మెరుగ్గానే ఉన్నట్టు తెలుస్తోంది. అందకని అశ్వన్ జట్టుతో కలిసేందుకు రాజ్కోట్ బయలుదేరనున్నాడు. రెండో రోజు అశ్విన్ స్థానంలో దేవ్దత్ పడిక్కల్ సబ్స్టిట్యూట్గా ఫీల్డింగ్ చేసిన విషయం తెలిసిందే.
అశ్విన్, అనిల్ కుంబ్లే
రాజ్కోట్ టెస్టులో జాక్ క్రాలేను ఔట్ చేసిన యశ్.. 500 వికెట్ల క్లబ్లో చేరాడు. మొత్తంగా ఈ ఫీట్ సాధించిన రెండో భారత స్పిన్నర్గా, తొమ్మిదో బౌలర్గా అశ్విన్ రికార్డు సృష్టించాడు. అతడి కంటే ముందు లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే 500 వికెట్ల మైలురాయికి చేరుకున్నాడు.