IND vs ENG 3rd Test : టీమిండియా ఓపెనర్ యశస్వీ జైస్వాల్(101 నాటౌట్) మరో సెంచరీ బాదాడు. రాజ్కోట్ టెస్టు రెండో ఇన్నింగ్స్లో సిక్సర్లతో హోరెత్తించిన యశస్వీ.. ఈ సిరీస్లో రెండో సెంచరీ కొట్టాడు. ఇంగ్లండ్ బౌలర్లన ఊచకోత కోసిన యశస్వీ.. మార్క్ వుడ్ బౌలింగ్లో బౌండరీతో శతకం పూర్తి చేసుకున్నాడు. 122 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో సుదీర్ఘ ఫార్మాట్లో మూడో శతకం ఖతాలో వేసుకున్నాడు.
రోహిత్ శర్మ ఔటయ్యాక కొంతసేపు నిదానంగా ఆడిన యశస్వీ ఒక్కసారిగా వేగం పెంచాడు. అండర్సన్ బౌలింగ్లో వరుసగా 6,4,4 బాదిన యశస్వీ.. ఆతర్వాత హర్ట్లేను ఉతికారేస్తూ రెండు సిక్సర్లు కొట్టాడు. మరో ఎండ్లో శుభ్మన్ గిల్(42) హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. దాంతో, టీమిండియా ఆధిక్యం 292 పరుగులకు చేరింది.
Double-century in Vizag
💯 & counting in Rajkot!Yashasvi Jaiswal in tremendous touch ✨#TeamIndia | #INDvENG | @ybj_19 | @IDFCFIRSTBank pic.twitter.com/ajBA4uJSHk
— BCCI (@BCCI) February 17, 2024
మూడో రోజు ఇంగ్లండ్ను 319 పరుగులకే కట్టడి చేసిన భారత్.. అనంతరం రెండో ఇన్నింగ్స్ను ధాటిగా ఆరంభించింది. అయితే.. ఓపెనర్ రోహిత్ శర్మ(30) దూకుడుగా ఆడబోయి రూట్ బౌలింగ్లో ఎల్బీగా ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన శుభ్మన్ గిల్()తో కలిసి యశస్వీ జైస్వాల్() జాగ్రత్తగా ఆడాడు. దాంతో, టీ బ్రేక్ సమయానికి భారత్ వికెట్ 44 నష్టానికి రన్స్ కొట్టింది.