బొమ్మలరామారం : యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ చిమ్ముల సుధీర్రెడ్డి అధ్యక్షతన శనివారం మండల ప్రత్యేక సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో కేంద్రమే వడ్లు కొనగులు చేయాలని తీర్మానం చేశారు. సమావేశానికి జడ్పీ చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత కొత్గా నిర్మించిన ప్రాజెక్టులతో సాగునీరు పెరిగి రైతులు పెద్ద మొత్తంలో వరి సాగు చేయడంతో దిగుబడి పెరిగిందన్నారు. కేంద్రం వడ్లు కొనుగోలు చేసేంత వరకు పోరాటం ఆపేదిలేదన్నారు. సమావేశంలో వైస్ ఎంపీపీ గొడుగు శోభ, ఎంపీడీఓ సరిత, పీఏసీఎస్ చైర్మన్ గూదె బాలనర్సయ్య, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మేడబొయిన గణేశ్, సర్పంచులు బట్కీర్ బీరప్ప, కుమార్, గోవింద్గౌడ్, ఎంపీటీసీలు హేమంత్రెడ్డి, ఈదమ్మ, లత, నర్సింహ పాల్గొన్నారు.
మోటకొండూర్ : కేంద్రమే ధాన్యం కొనుగోలు చేయాలని మండల ప్రజా పరిషత్ గౌరవ సభ్యులంతా తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ పైళ్ల ఇందిరాసత్యనారాయణరెడ్డి, వైస్ ఎంపీపీ ఇల్లెందుల మల్లేశ్గౌడ్ మాట్లాడుతూ.. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం కొర్రీలు పెట్టడం సరి కాదన్నారు. షరతులు లేకుండా పంజాబ్ తరహాలో తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వీరస్వామి, వ్యవసాయాధికారి సుజాత, ఎంపీటీసీ పన్నాల అంజిరెడ్డి, జ్యోతిలక్ష్మి, ఏపీఓ అరుణకుమారి, సర్పంచులు వడ్డెబోయిన శ్రీలత, స్వప్న, మల్గ ఎట్టమ్మ, గీత పాల్గొన్నారు.
తుర్కపల్లి : తుర్కపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం మండల పరిషత్ అత్యవసర సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతాంగం పండించిన ధాన్యాన్ని పంజాబ్ తరహాలో కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. తీర్మాన పత్రాలను ప్రధాని మోదీకి పోస్టు ద్వారా పంపించనున్నట్లు ఎంపీపీ భూక్యా సుశీలారవీందర్ తెలిపారు. కేంద్రం రాష్ట్ర రైతాంగంపై చేస్తున్న మోసపూరిత కుట్రలను ఆపాలన్నారు. సమావేశంలో వైస్ ఎంపీపీ మహదేవుని శ్రీనివాస్, ఎంపీడీఓ ఉమాదేవి, పీఏసీఎస్ చైర్మన్ సింగిరెడ్డి నరసింహారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు పలుగుల నవీన్కుమార్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పోగుల ఆంజనేయులు, సర్పంచులు, ఎంపీటీసీలు గిద్దె కరుణాకర్, కోమటిరెడ్డి సంతోష, కనకలక్ష్మి, శ్రీనివాస్యాదవ్, బోరెడ్డి వనజ, ప్రతిభారాజేశ్, మోహన్బాబు, పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట రూరల్/రాజాపేట : వడ్లను కేంద్ర ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని యాదగిరిగుట్ట, రాజాపేట మండలాల ప్రజాప్రతినిధులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఎంపీపీలు చీర శ్రీశైలం, గోపగాని బాలమణి, జడ్పీటీసీ తోటకూరి అనూరాధ, వైస్ ఎంపీపీ ననబోలు ప్రసన్న, ఎంపీడీఓ ప్రభాకర్రెడ్డి, సర్పంచులు కర్రె వెంకటయ్య, తోటకూరి బీరయ్య, వంటేరు సువర్ణ, రజిత, చెరుకు విజయ, దేవినాయక్, నర్సమ్మ, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
ఆలేరు రూరల్/ఆత్మకూరు(ఎం) : కేంద్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేయాలని ఆలేరు సర్పంచ్ ఆరుట్ల లక్ష్మీప్రసాద్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మెరకు గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించి తీర్మానం చేశారు. సమావేశంలో ఉప సర్పంచ్ మామిడాల అనిత, వార్డు సభ్యులు గుర్రాల బాలరాజు, అమృతం బాలరాజు, రాజశేఖర్, నరేందర్, ఎల్లమ్మ, లావణ్య, రమ, కమల పాల్గొన్నారు. ఆత్మకూరు(ఎం)మండలం మొరిపిరాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ సామ తిరుమల్రెడ్డితోపాటు గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు కేంద్రమే వడ్లు కొనుగోలు చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శేఖర్, ఉప సర్పంచ్ జ్యోతి, వార్డు సభ్యులు భారతమ్మ, సుగణ, స్వామి, మల్లయ్య, కృష్ణ పాల్గొన్నారు.
భువనగిరి అర్బన్/బీబీనగర్/రామన్నపేట/మోత్కూర్/గుండాల : యాసంగిలో రైతులు పండించిన వడ్లను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని భువనగిరి, బీబీనగర్, రామన్నపేట, మోత్కూర్, గుండాల మండల ప్రజా పరిషత్ పాలకవర్గాలు శనివారం ప్రత్యేక సమావేశాలు నిర్వహించి తీర్మానాలు చేశాయి. తీర్మాన ప్రతులను ప్రధాని నరేంద్రమోదీకి పోస్టు ద్వారా పంపించాలని నిర్ణయించాయి. ఈ సందర్భంగా ఆయా మండలాల ఎంపీపీలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీరు, పెట్టుబడి సాయం అందిస్తుండటంతో రైతులు విస్తారంగా పంటలు పండిస్తున్నారని పేర్కొన్నారు. పంజాబ్, హర్యానా రాష్ర్టాల తరహాలో రాష్ట్రంలో పండిన ప్రతి వరి గింజనూ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీలు నరాల నిర్మలావెంకటస్వామి, సుధాకర్గౌడ్, కన్నెబోయిన జ్యోతీబలరాం, రచ్చ కల్పన, అమరావతి, జడ్పీటీసీలు సుబ్బూరు బీరు మల్లయ్య, లక్ష్మీరాములు, వైస్ ఎంపీపీలు ఏనుగు సంజీవరెడ్డి, వాకిటి గణేశ్రెడ్డి, మహేందర్రెడ్డి పీఏసీఎస్ చైర్మన్లు నోముల పరమేశ్వర్రెడ్డి, ఎంపీడీఓలు గుత్తా నరేందర్రెడ్డి, శ్రీవాణి, జలేందర్రెడ్డి, మనోహర్రెడ్డి, శ్రీనివాసులు, సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.