కందుకూరు, మే 24 : బాచుపల్లి గ్రామ సర్పంచ్గా యాలాల శ్రీనివాస్ను నియమిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అమయ్కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులను జారీ చేశారు. సర్పంచ్గా నియమించిన వెంటనే శ్రీనివాస్ మంగళవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సర్పంచ్ ఎన్నికల్లో శ్రీనివాస్ విజయం సాధించారు. పంచాయతీ నిధులు దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు రావడంతో వివరణ కోసం కలెక్టర్ నోటీసులు జారీ చేశారు.
నోటీసుకు సమాధానం ఇవ్వక పోవడంతో శ్రీనివాస్తోపాటు ఉప సర్పంచ్ ప్రేమలమ్మను సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. తిరిగి విచారణ జరపడంతో అక్రమాలు జరిగినట్లు రుజువు కాలేదు. దీంతో తిరిగి వారిని నియమిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. దీంతో సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ ప్రేమలమ్మ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి సంతోషం వ్యక్తం చేశారు.