యాదాద్రి, డిసెంబర్ 26: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ప్రధానాలయంలో కల్యాణోత్సవ సేవను అర్చకులు, అధికారులు అత్యంత వైభవంగా జరిపారు. సోమవారం ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి గజ వాహనంపై వేంచేపు చేసి సేవ కొనసాగించారు. అనంతరం స్వామివారికి నిత్య తిరుకల్యాణోత్సవం వైభవంగా సాగింది.
ధనుర్మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారికి తిరుప్పావై నిర్వహించారు. సోమ వారం స్వామివారిని 30 వేల మంది భక్తులు దర్శించుకొన్నారు. స్వామివారి ఖజానాకు రూ.44,87,670 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో ఎన్ గీత తెలిపారు.