యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి దాతల స్పందన కొనసాగుతున్నది. పలువురు దాతలు తమకు తోచిన విరాళాలను స్వామివారికి సమర్పిస్తున్నారు. ఆదివారం రాష్ట్ర ఎలక్టిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టగా, ఆలయ అర్చకులు వారికి స్వామివారి వేద ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం వారు స్వామివారి విమాన గోపురం స్వర్ణతాపడానికి రూ.1,16,000 సమర్పించారు. ఇందుకు సంబంధించిన చెక్కును యాదాద్రి బాలాలయంలో ఆలయ ఏఈవో గట్టు శ్రవణ్కుమార్కు అందజేశారు.
రూ. 1.16కోట్లు చెక్కును మంత్రి కేటీఆర్కు..
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి విమాన గోపురం స్వర్ణతాపడానికి అయ్యప్ప ఇన్ఫ్రా ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ డైరక్టర్ వి. రవివర్మ భారీ విరాళం సమర్పించారు. రూ. 1,16,00,000 విలువ గల చెక్కును హైదారాబాద్లోని ప్రగతిభవన్లో రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్కు ఆదివారం అందజేశారు.