యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు ఆదివారం రూ. 15,47,185 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 2,53,650, రూ. 100 దర్శనం టిక్కెట్ ద్వారా 19,600, వీఐపీ దర్శనాలతో 1,73,250, వేద ఆశీర్వచనం ద్వారా 10,836, సుప్రభాతం ద్వారా 2,200, ప్రచారశాఖ ద్వారా 220, క్యారీ బ్యాగుల విక్రయం ద్వారా 5,500, వ్రత పూజలతో 40,500, కల్యాణకట్ట టిక్కెట్లతో 32,000,
ప్రసాద విక్రయం ద్వారా 7,13,190 , వాహనపూజల ద్వారా 16,500, టోల్గేట్ ద్వారా 2,530, అన్నదాన విరాళం ద్వారా 8,381, సువర్ణ పుష్పార్చన ద్వారా 1,34,500, యాదరుషి నిలయంతో 75,560, పాత గుట్ట నుంచి 30, 770, గోపూజ ద్వారా 650 మొత్తంగా రూ.15,47,185 ఆదాయం సమకూరిందని ఈవో గీత తెలిపారు.