యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు శనివారం రూ.13,47,331 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 2,91,318, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 28,000, వీఐపీ దర్శనాలతో 2, 25,000, వేద ఆశీర్వచనం ద్వారా 10,320, నిత్య కైంకర్యాల ద్వారా 300, సుప్రభాతం ద్వారా 800, క్యారీబ్యాగుల విక్రయం ద్వారా 5,500, వ్రత పూజల ద్వారా 46,000, కల్యాణకట్ట టిక్కెట్ల ద్వారా 25,800,
ప్రసాద విక్రయాల ద్వారా 4,29,740, వాహన పూజలతో 11,600, టోల్ గేట్ ద్వారా 2,220, అన్నదాన విరాళాలతో 29,223, సువర్ణ పుష్పార్చన ద్వారా 1,08,200, యాద రుషి నిలయం ద్వారా 65,700, పాతగుట్ట నుంచి 19, 110, ఇతర విభాగాల ద్వారా 19,199 మొత్తంగా ఖజానాకు రూ.13,47,331 ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు.