యాదాద్రి: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఖజానాకు ఆదివారం రూ.16,58,864 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 3,21,058, వీఐపీ దర్శనాలతో 2,85,000, వేద ఆశీర్వచనం ద్వారా 5,160, సుప్రభాతం ద్వారా 200, ప్రచారశాఖ ద్వారా 840, క్యారీ బ్యాగుల విక్రయం ద్వారా 5,000, వ్రత పూజలతో 36,500,
కల్యాణ కట్ట ద్వారా 25,800, ప్రసాద విక్రయం ద్వారా 6,58,495, వాహన పూజలతో 15,500, టోల్గేట్ ద్వారా 3,570, అన్నదాన విరాళం ద్వారా 25,410, సువర్ణ పుష్పార్చన ద్వారా 1,45,320, యాదరుషి నిలయం ద్వారా 69,620, పాతగుట్ట నుంచి 39,175 మొత్తంగా ఖజానాకు రూ.16,58,864 ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు.