యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి పునర్నిర్మాణంలో భాగంగా కొండపైన నిర్మించిన అధునాతన విష్ణు పుష్కరిణి ఎల్ఈడీ లైట్లను బిగిస్తున్నారు. పుష్కరిణి ప్రహరీకి బంగారు వర్ణపు అల్యూమినియంతో తయారు చేసిన గ్రిల్స్ ఏర్పాటు చేశారు.
వీటికి ఫిల్లర్ బాక్స్లను బిగించి వాటి పై ఎల్ఈడీ లైట్లను బిగిస్తున్నారు. ఒక్కో ఫిల్లర్కు బిగించే స్టాండ్కు ఎల్ఈడీ లైట్లను పొందుపరుస్తున్నారు. పుష్కరిణీ చుట్టూ మొత్తం 18 విద్యుద్దీపాలు రానున్నాయి.