హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): జాగృతి యునైటెడ్ కింగ్డమ్ సమర్పణలో సురభి నాటక కళాకారులు ఆదివారం తెలంగాణ తిరుపతి ‘యాదాద్రి మహోద్భవం’ దృశ్య కావ్యాన్ని ప్రదర్శించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని జూమ్ యాప్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేశారు. యాదాద్రి పుణ్యక్షేత్రం గురించి తెలుసుకోవడంతోపాటు కళాకారులను ప్రోత్సహించడం ఆనందంగా ఉన్నదని యూకే జాగృతి అధ్యక్షుడు సుమన్రావు బల్మూరి పేర్కొన్నారు.