యాదాద్రి, అక్టోబర్ 5 : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో మంగళవారం క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి ఆకుపూజను అర్చకులు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. కొండపైన భక్తుల నూతన క్యూ కాంప్లెక్స్ పక్కనే గల విష్ణుపుష్కరిణి చెంత, పాతగుట్ట ఆలయంలో కొలువుదీరిన ఆంజనేయుడిని కొలుస్తూ వేదమంత్ర పఠనం, పంచామృతాభిషేకం, సింధూరంతో అలంకరించారు. తమలపాకులతో అర్చన చేశారు. వివిధ రకాల పూలమాలలతో అలంకరణ, సహస్రనామ పఠనంతో నాగవల్లి దళార్చన నిర్వహించారు. లలితాపారాయణం చేసి ఆంజనేయస్వామికి ఇష్టమైన వడపప్పు, బెల్లం, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో నిత్యపూజలు ఉదయం 4 గంటలకు ప్రారంభమయ్యాయి. సుప్రభాత సేవ మొదలుకుని నిజాభిషేకం వరకు కోలాహలంగా కొనసాగాయి. నిత్యపూజల్లో భాగంగా బాలాలయ మండపంలో శ్రీలక్ష్మీనరసింహుల నిత్య తిరుకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. మొదటగా ఉదయం 8 గంటలకు శ్రీసుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. స్వామివారి మహా మండపంలో అష్టోత్తరం జరిపించారు. సాయంత్రం వేళ అలంకార జోడు సేవోత్సవాన్ని సంప్రదాయంగా చేపట్టారు. భక్తులకు శ్రీస్వామి అమ్మవారుల ఆశీస్సులు అందజేశారు. పాతగుట్టలో శ్రీలక్ష్మీనరసింహస్వామివారి నిత్యపూజలు ఆలయ సంప్రదాయరీతిలో కొనసాగాయి. శ్రీవారి ఖజానాకు రూ.7,91,225 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.
శ్రీవారి ఖజానా ఆదాయం (రూపాయల్లో)
ప్రధాన బుకింగ్ ద్వారా 80,510
రూ.100 దర్శనం టిక్కెట్ 21,500
వేద ఆశీర్వచనం 8,772
సుప్రభాతం 200
క్యారీబ్యాగుల విక్రయం 30,000
వ్రత పూజలు 29,000
కల్యాణకట్ట టిక్కెట్లు 12,800
ప్రసాద విక్రయం 3,67,620
వాహన పూజలు 8,000
టోల్గేట్ 660
అన్నదాన విరాళం 12,150
సువర్ణ పుష్పార్చన 82,380
యాదరుషి నిలయం 31,450
పాతగుట్ట నుంచి 23,735
ఇతర విభాగాలు 50,032