యాదాద్రి/బొమ్మలరామారం/ఆలేరుటౌన్, నవంబర్ 18 : వడ్లకొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన మహాధర్నాకు ఆలేరు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ముఖ్య నాయకులు భారీగా తరలివెళ్లారు. ముఖ్యమంత్రి కేసీఆర్బాటలోనే మేమంటూ ప్రతినబూనారు. వడ్ల కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఉద్యమనేత, సీఎం కేసీఆర్ వెంటే ఉంటామని తెలిపారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, మున్సిపల్ చైర్పర్సన్ ఎరుకల సుధ, మండల సెక్రటరీ జనరల్ కసావు శ్రీనివాస్, రైతుబంధు సమితి జిల్లా డైరక్టర్ మిట్ట వెంకటయ్య, ఎరుకల హేమేందర్గౌడ్ ఉన్నారు. బొమ్మలరామారం నుంచి ఎంపీపీ చిమ్ముల సుధీర్రెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మేడబోయిన గణేశ్, పార్టీ మండలాధ్యక్షుడు వెంకటేశ్గౌడ్, నవీన్, శాంతాచారి వెళ్లారు. ఆలేరు మున్సిపాలిటీ నుంచి మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, పుట్ట మల్లేశ్, ఆడెపు బాలస్వామి, దాసి సంతోష్, సరాబు సంతోష్, శంకర్ ఉన్నారు.
రాజాపేట/తుర్కపల్లి, నవంబర్ 18 : హైదరాబాద్లోని ధర్నాచౌక్లో గురువారం నిర్వహించిన మహాధర్నాకు రాజాపేట, తుర్కపల్లి మండలాల నుంచి టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. తరలినవారిలో ఎంపీపీ భూక్యా సుశీలారవీందర్, వైస్ ఎంపీపీ శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు నాగిర్తి రాజిరెడ్డి, సింగిరెడ్డి నర్సింహారెడ్డి, జడ్పీటీసీ చామకూర గోపాల్గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ బీకూనాయక్, టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్స్ సందిల భాస్కర్గౌడ్, శాగర్ల పరమేశ్, అధికార ప్రతినిధి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బద్దూనాయక్, కో ఆప్షన్ సభ్యుడు షరీఫ్, మాజీ ఎంపీపీ రవీంద్రనాథ్గౌడ్, సర్పంచులు ఎంపీటీసీలు, రైతులు ఉన్నారు.
యాదగిరిగుట్ట రూరల్/ గుండాల/ ఆత్మకూర్(ఎం)/ మోటకొండూరు : యాదగిరిగుట్ట మండలం చొల్లేరు నుంచి సర్పంచ్ తోటకూరి బీరయ్య ఆధ్వర్యంలో నాయకులు ధర్నాకు తరలివెళ్లారు. గుండాల నుంచి టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఖలీల్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు బొంగు శ్రీశైలం, నాయకులు కోలుకొండ రాములు, చిన్నపరెడ్డి, ఆత్మకూర్(ఎం) నుంచి టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బీసు చందర్గౌడ్, కార్యదర్శి మల్లెల పర్వతాలు, కట్టెల నర్సయ్య, యాస రంగారెడ్డి, యాస ఇంద్రారెడ్డి ఉన్నారు. మోటకొండూరు నుంచి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటాచారి, ఎంపీటీసీ పన్నాల అంజిరెడ్డి, రైతు బంధు సమితి కన్వీనర్ భూమండ్ల అయిలయ్య, కో అప్షన్ సభ్యుడు బురాన్ ఉన్నారు.
భువనగిరి నియోజకవర్గం నుంచి..
భువనగిరి అర్బన్/ వలిగొండ/చౌటుప్పల్ రూరల్/భూదాన్పోచంపల్లి/బీబీనగర్ : టీఆర్ఎస్ భువనగిరి మండలాధ్యక్షుడు జనగాం పాండు ఆధ్వర్యంలో మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు అధిక సంఖ్యలో తరలివెళ్లారు. ఈ సందర్భంగా ధర్నా వాల్ పోస్టర్ను మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు ఆవిష్కరించారు. మున్సిపల్ వైస్చైర్మన్ చింతల కిష్టయ్య, రైతబంధు సమితి మండల కన్వీనర్ కంచి మల్లయ్య, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఓంప్రకాశ్గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సిలువేరు మధు, నాయకులు అతికం లక్ష్మీనారాయణగౌడ్, బల్గూరి మధుసూదన్రెడ్డి, జక్క రాఘవేందర్రెడ్డి, సిలువేరు ఏసు, నోముల మహేందర్రెడ్డి, చంద్రమ్మ, ఎంపీటీసీలు, సర్పంచులు ఉన్నారు. కూనూరు సర్పంచ్ అంకర్ల మురళీకృష్ణ, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు పాశం మహేశ్ ఆధ్వర్యంలో ధర్నాకు తరలివెళ్లారు. పాల సంఘం చైర్మన్ మల్లేశ్, నాయకులు రమేశ్, కృష్ణ, రాములు, యాదగిరి, సురేశ్, ఆంజనేయులు ఉన్నారు. వలిగొండ నుంచి పార్టీ పట్టణాధ్యక్షుడు ఎమ్మె లింగస్వామి ఆధ్వర్యంలో తరలివెళ్లారు. ఏఎంసీ చైర్పర్సన్ కునపురి కవిత, రైతు బంధు సమితి కన్వీనర్ పనుమటి మమత, పీఏసీఎస్ చైర్మన్ సుర్కంటి వెంకట్రెడ్డి, నాయకులు తుమ్మల వెంకట్రెడ్డి, మొగుళ్ల శ్రీనివాస్, మద్దెల మంజుల, మామిండ్ల రత్నయ్య, శాంతికుమార్ ఉన్నారు. చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో పలువురు నాయకులు ధర్నాకు తరలివెళ్లారు. భూదాన్పోచంపల్లి మండలం నుంచి ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పాటి సుధాకర్రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 500 మందికి పైగా తరలి వెళ్లారు. పోచంపల్లి నుంచి మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మీశ్రీనివాస్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు వెంకటేశం ఆధ్వర్యంలో 100 మంది వెళ్లారు. బీబీనగర్ మండలం నుంచి నాయకులు, రైతులు 400 మంది తరలివెళ్లారు.