టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెంకటయ్య
యాదాద్రి, నవంబర్ 11 : వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆలేరులో చేపట్టే ధర్నాకు టీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలిరావాలని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య కోరారు. పంజాబ్లో కొనుగోలు చేస్తున్న కేంద్రం, తెలంగాణలో ఎందుకు చేయడం లేదో ఇక్కడి బీజేపీ నాయకులు రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వరి ధాన్యం కొనుగోలు చేసేవరకూ నిరసనలు కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఎరుకల సుధాహేమేందర్గౌడ్, టీఆర్ఎస్ మండల సెక్రటరీ జనరల్ కసావు శ్రీనివాస్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పెలిమెల్లి శ్రీధర్గౌడ్, సెక్రటరీ జనరల్ అంకం నర్సింహ, రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు మిట్ట వెంకటయ్య, రాజేశ్యాదవ్ పాల్గొన్నారు.
పెద్ద ఎత్తున తరలిరావాలి
ఆలేరురూరల్ : రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆలేరు పట్టణంలో నిర్వహించే మహాధర్నాకు సర్పంచులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు బక్క రాంప్రసాద్ కోరారు. గురువారం రాఘవాపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు కె.మల్లేశ్, నాయకులు నరేశ్, సంతోష్, మల్లేశ్ పాల్గొన్నారు.
తుర్కపల్లి : టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆలేరులో నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని పార్టీ మండలాధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్రెడ్డి కోరారు. ధర్నాకు మండలంలోని ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ అనుబంధ సంఘాల నాయకులు, రైతుబంధు సమితి సభ్యులు, పార్టీ కార్యకర్తలు, అధికసంఖ్యలో తరలిరావాలని కోరారు.
బొమ్మలరామారం : ఆలేరులో నిర్వహించే నిరసన ప్రదర్శనకు రైతులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెంకటేశ్గౌడ్ పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పాపిరెడ్డి, భరత్, శ్రీకాంత్, రామకృష పాల్గొన్నారు.
భువనగిరి అర్బన్ : కలెక్టరేట్ ఎదుట నేడు 10గంటలకు నిర్వహించే ధర్నాలో రైతులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జనగాం పాండు, ప్రధాన కార్యదర్శి నీల ఓంప్రకాశ్గౌడ్ కోరారు. ధర్నాలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి పాల్గొంటారని, టీఆర్ఎస్ గ్రామశాఖలు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, సభ్యులు పాల్గొనాలని పేర్కొన్నారు.
రామన్నపేట : నకిరేకల్లో శుక్రవారం నిర్వహించే మహాధర్నాకు రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మందడి ఉదయ్రెడ్డి కోరారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంంలో ఆయన మాట్లాడారు. నంద్యాల భిక్షంరెడ్డి, పున్న జగన్మోహన్, కన్నెబోయిన బలరాం, అంతటి రమేశ్, అప్పం లక్ష్మీనర్సు, గొరిగె నర్సింహ, అమేర్, ముత్తయ్య, శ్రీనివాస్రెడ్డి, ప్రసాద్, నరేందర్ పాల్గొన్నారు.
మోత్కూరు : కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తుంగతుర్తిలో శుక్రవారం నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని పార్టీ మండలాధ్యక్షుడు పొన్నెబోయిన రమేశ్ కోరారు. గురువారం మండల కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ హాజరు కానున్నట్లు తెలిపారు. ఆయన వెంట సోంమల్లు ఉన్నారు.