ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి
బీబీనగర్, నవంబర్ 9 : పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మండలంలోని జమీలాపేట్, జియాపల్లి, జియాపల్లి తండా, రహీంఖాన్గూడెం, రాఘవాపురం, రుద్రవెల్లి, పల్లెగూడెం, వెంకిర్యాల గ్రామాల్లో రూ.95 లక్షల హెచ్ఎండీఏ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు. వెంకిర్యాల గ్రామంలో గొర్రెలు, మేకల పెంపకందారులకు ఐదు షెడ్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను గొర్రెలు, మేకల పెంపకందారులు సన్మానించారు. అనంతరం రాఘవాపురంలో ఇటీవల మృతిచెందిన వారి కుటుంబాలకు పైళ్ల ఫౌండేషన్ ద్వారా రూ.5వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సుధాకర్గౌడ్, జడ్పీటీసీ గోలి ప్రణీతాపింగళ్రెడ్డి, వైస్ ఎంపీపీ వాకిటి గణేశ్రెడ్డి, భువనగిరి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆల్వ మోహన్రెడ్డి, సర్పంచులు మంచాల రవికుమార్, ప్రేమలత, కుమార్, మంగమ్మ, స్వప్న, రాజేందర్, సుదర్శన్, ఎంపీటీసీ ఆండాలు, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ బొక్క జైపాల్రెడ్డి, చింతల పాల్గొన్నారు.
సీసీ కెమెరాలు ప్రారంభం
బీబీనగర్ వెంకిర్యాల గ్రామంలో గ్రామస్తులు కృష్ణారెడ్డి, కనకయ్య సహకారంతో ఏర్పాటు చేసిన 28 సీసీ కెమెరాలను ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, డీసీపీ నారాయణరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు అదుపు చేయవచ్చుని, ప్రతి గ్రామంలోనూ సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరని అన్నారు. జడ్పీటీసీ గోలి ప్రణీతాపింగళ్రెడ్డి, ఎస్ఐ రాఘవేందర్గౌడ్, సర్పంచ్ అరిగె సుదర్శన్, ఎంపీటీసీ గండు వసంత, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ బొక్క జైపాల్రెడ్డి పాల్గొన్నారు.