WTC 2023 : టెస్టు క్రికెట్కు కొత్త జీవం తెచ్చిన ప్రపంచటెస్టు చాంపియన్షిప్(WTC 2023 Final) మరికొన్ని రోజుల్లో మెదలుకానుంది. ఇంగ్లండ్లోని ఓవల్ స్డేడియం వేదికగా జూన్ 7న టెస్టు గద పోరాటానికి తెరలేవనుంది. దాంతో, ఫైనల్కు చేరిన భారత్, ఆస్ట్రేలియా జట్లు తమ తుది బృందాన్ని ప్రకటించాయి. ఇరుజట్ల క్రికెట్ బోర్డులు 15 మంది ఆటగాళ్లతో కూడిన జాబితాను విడుదల చేశాయి.
తొలుత అనుకున్న పేర్లలో టీమిండియా ఒక మార్పు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో యంగ్స్టర్ యశస్వీ జైస్వాల్ను స్టాండ్ బై ప్లేయర్గా ఎంపిక చేసింది. ఆల్రౌండర్ మిచెల్ మార్ష్, రెన్ షాలు ఆసీస్ స్టాండ్ బై ప్లేయర్స్గా సెలక్ట్ అయ్యారు.
భారత్ : రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, ఛటేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కేఎస్ భరత్(వికెట్ కీపర్), అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, శార్ధూల్ ఠాకూర్, షమీ, సిరాజ్, ఉమేశ్ యాదవ్, ఉనాద్కాట్.
స్టాండ్ బై ప్లేయర్స్ : యశస్వీ జైస్వాల్, ముకేశ్ కుమార్, సూర్యకుమార్ యాదవ్.
ఆస్ట్రేలియా : ప్యాట్ కమిన్స్(కెప్టెన్), స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ కామెరూన్ గ్రీన్, లబుషేన్, హేజిల్వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, నాథన్ లియాన్, టాడ్ మర్ఫీ, స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్.
స్టాండ్ బై ప్లేయర్స్ : మిచెల్ మార్ష్, మాథ్యూ రెన్ షా.
ICC has confirmed first 15 & standby players of India & Australia for WTC final. pic.twitter.com/EU7xDuVYmj
— Johns. (@CricCrazyJohns) May 28, 2023