బజార్హత్నూర్మార్చి17 : చుట్టూ జనం, డప్పు చప్పుళ్ల మధ్య ప్రేక్షకుల ఈలల మోత.. బరిలో నిలిచిన మల్లయోధుల జబ్బ చరుపు లు.. ప్రత్యర్థిని మట్టి కరిపించేందుకు వేసే ఎత్తులు, అరుపులు.. కేరింతలు ఇవీ కుస్తీ పోటీల్లో కనిపించే దృశ్యాలు.. ఇలాంటి దృశ్యాలకు బజార్హత్నూర్ వేదికగా మారుతున్నది. హోలీ పర్వదినాన్ని పుర స్కరించుకొని సంప్రదాయంగా వస్తున్న కుస్తీ పోటీలను శుక్రవారం భారీ ఎత్తున నిర్వహించ నున్నట్లు గ్రామపెద్దలు పేర్కొన్నారు. కుస్తీ పోటీల్లో కిన్వడ్, నాందేడ్, నాసిక్, నాగ్పూర్, హర్యానా, హిమయత్నగర్తోపాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి మల్లయోధులు తరలివస్తుంటా రు. బజార్హత్నూర్ మహారాష్ట్రకు సరిహద్దు ప్రాంతం. మొదట కొబ్బరికాయ నుంచి మొదలు పెట్టి గ్రామంలో ఉన్న చిన్నారులతో కుస్తీపోటీలు ప్రారంభిస్తారు. 100నుంచి రూ.20వేల వరకు కుస్తీ పోటీలు నిర్వహించనున్నారు. గ్రామ పెద్దలే న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తారు.
మల్లయుద్ధంలో మట్టి కుస్తీ, మ్యాట్ కుస్తీ అని రెండు రకాలుంటాయి. వీటిలో మట్టి కుస్తీకే ఎక్కువ శారీరక దృఢత్వం అవసరం. ఇందులో కండబలం ఉన్నవాళ్లదే పై చేయి సాధిస్తారు. దీనికి ప్రత్యేకంగా సమయం అని ఉండదు. సత్తా ఉన్నం త సేపు పట్టు పట్టొచ్చు.
పోటీల్లో కొన్ని నిబంధనలు ఉంటాయి. ఒక సారి ఓడిన మల్లయోధుడు మరోసారి పాల్గొన డానికి అనర్హుడు.నిర్వాహకులు ప్రత్యేకంగా అను మతిస్తే తప్ప మళ్లీ ఆడరు. పాల్గొనే వారు ముందు మైదానంలో కూర్చుంటారు. సమాన యోధుడు ఆసక్తి చూపితేనే తలపడడానికి అంగీకరిస్తారు. తుది నిర్ణయం నిర్వాహకులదే.
తరతరాలుగా వసున్త్న సంప్రదాయాన్ని నేటికి కొనసాగిస్తున్నం. కుస్తీ పోటీలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశాం. వివిధ ప్రాంతాల్లో నుం చి వచ్చే మల్లయోధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పిస్తాం. గ్రామస్తుల సహకారంతో ఈ పోటీలు ప్రశాంతంగా నిర్వహిస్తాం.
– గ్రామ సర్పంచ్ లావణ్య