యాదగిరిగుట్ట : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని మంగళవారం రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ సంప్రదాయం ప్రకారం ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయనతో ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేయించారు. ఆ తర్వాత అర్చకులు వేదాశీర్వచనం చేయగా.. అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.