న్యూఢిల్లీ: క్రీడా కార్యక్రమాలను కరోనా మహమ్మారి వదలడం లేదు. వైరస్ వ్యాప్తి కారణంగా ఇస్తాంబుల్ వేదికగా డిసెంబర్ 4 నుంచి 18 మధ్య జరుగాల్సిన మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్ వాయిదా పడింది. మార్చి 2022 వరకు మెగాటోర్నీని వాయిదా వేస్తున్నట్లు అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబా) అధ్యక్షుడు ఉమర్ క్రెమ్లెవ్ బుధవారం ప్రకటించాడు.