హైదరాబాద్: మహిళలకు అవకాశాలు కల్పిస్తే అద్భుతంగా పని చేస్తారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జిల్లాల్లో మహిళా ఎస్పీలు సమర్ధవంతంగా పనిచేస్తున్నారని చెప్పారు. భవిష్యత్లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా ఓ మహిళ రావాలన్నారు. సిటీ పోలీస్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నెక్లస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో జెండర్ ఫర్ ఈక్వాలిటీ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ విజయలక్ష్మి, నగర సీపీ సీవీ ఆనంద్, పలువురు పోలీసులు ఉన్నతాధికారులు, వందలాది మంది యువతులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సిబితా మాట్లాడుతూ.. మహిళా ఎస్హెచ్వోను లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్కు కేటాయించడం మంచి పరిణామని చెప్పారు. మహిళల భద్రతపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టి షీ టీమ్స్ ఏర్పాటు చేశారని వెల్లడించారు.
మహిళా దినోత్సవాన్ని మూడు రోజులపాటు జరుపుతున్నామని హోం మంత్రి మహమ్మద్ అలీ చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలను అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. పోలీసుల నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలుచేస్తున్నామని వెల్లడించారు.