చిలిపిచెడ్ : మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలోని అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార మాసోత్సవాలు నిర్వహించారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు పోషణ మాసం కార్యక్రమాలు జరుగుతాయని మండల ఐసీడీసీ సూపర్వైజర్ సంతోషి( Santoshi ) వెల్లడించారు.
ఈ సందర్భంగా శుక్రవారం మండలంలోని టోపీ తండాలో పోషణ మాసం నిర్వహించారు. స్థానికంగా లభించే కూరగాయలు, పండ్లు తీసుకోవాలని సూచించారు. తాజా ఆకుకూరలు, పండ్లలో అనేక పోషక విలువలు ఉంటాయని అన్నారు. ముఖ్యంగా మహిళలలో రక్తహీనత ( Anemia ) రాకుండా బలమైన పోషకాహారాన్ని ( Nutrition ) జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
కేవలం మహిళలకే కాకుండా మగవారికి కూడా పోషకాహారంపై అవగాహన కలిగి ఉండాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కిశోర బాలికలు, గర్భిణీలు, తల్లులు, పంచాయతీ కార్యదర్శి హనుమంతు, ప్రైమరీ స్కూల్ టీచర్, ఆశ, ఇన్చార్జి అంగన్వాడీ టీచర్ తదితరులు పాల్గొన్నారు.