Current Shock | వరంగల్ జిల్లా వర్దన్నపేట మండలం ఇల్లందలో విషాదం నెలకొంది. టవల్ ఆరేస్తుండగా కరెంటు షాక్తో మహిళ మృతి చెందింది.
ఇల్లంద గ్రామానికి చెందిన ఊర సమ్మక్క (45) సోమవారం ఉదయం ఇంటి ముందు ఉన్న దండంపై టవల్ ఆరేసింది. అయితే ఆ దండానికి కరెంటు ప్రసరణ జరగడంతో ఆమె విద్యుదాఘాతానికి గురైంది. ఇది గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆమెను వర్దన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మృతిచెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు.