లక్నో: మజ్లిస్ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (MP Asaduddin Owaisi) కారుపై కాల్పుల ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. గురువారం సాయంత్రం ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారం ముగించుకుని హపూర్ జిల్లా నుంచి ఢిల్లీ వెళ్తుండగా.. హపూర్- ఘజియాబాద్ మార్గంలోని చిజారసీ టోల్ప్లాజా వద్ద ఒవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కేసులో నిన్ననే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు యూపీ ఏడీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు.
Police arrested two persons for firing on the car of AIMIM MP Asaduddin Owaisi yesterday. The arms used in the crime were recovered. The accused said they were hurt by his remarks against a particular religion. They will be produced before the court: UP ADG (L&O) Prashant Kumar pic.twitter.com/eusO9MGZK0
— ANI (@ANI) February 4, 2022
నిందితుల నుంచి కాల్పులకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఓ మతానికి వ్యతిరేకంగా ఎంపీ చేసిన వ్యాఖ్యలు తమను బాధించాయని, దీంతోనే ఒవైసీపై కాల్పులు జరిపినట్లు చెప్పారన్నారు. నిందులిద్దరిని కోర్టులో హాజరు పరుస్తాం చెప్పారు.
నిందితుల్లో ఒకరైన సచిన్ పండిట్ బీజేపీలో క్రియాశీలక కార్యకార్త. పార్టీ సభ్యత్వానికి సంబంధిన రిసిప్ట్ను సచిన్ సోషల్ మీడియాలో ఉంచారు. అందులో దేశ్ భక్త్ సచిన్ హిందూ అని తన పేరును పేర్కొన్నాడు. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, ఎంపీ మహేశ్ శర్మలతో కలిసి దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.