‘భద్రం బీకేర్ఫుల్ బ్రదర్’ ఫేమ్ చరణ్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘రోరి’. బుధవారం చరణ్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు ఈ చిత్రం మొదటి లుక్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ ‘పొలిటికల్ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. అనుకోని పరిస్థితుల్లో పాకిస్తాన్ వెళ్లిన యువకుడు, అక్కడ హిందువులని కలిసి వారి కష్టాలు తెలుసుకుని వారితో ఇండియాకి క్షేమంగా వచ్చాడా లేదా అనేది చిత్ర కథ. సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా వుంటుంది’ అన్నారు. కోట శ్రీనివాసరావు, జయప్రకాష్, దేవి ప్రసాద్, కాదంబరి కిరణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సెసిరొలియో.