Wipro Q4 results | దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన విప్రో (Wipro).. గత ఆర్థిక సంవత్సరం (2023-24) మార్చి త్రైమాసికంలో రూ.2,835 కోట్ల నికర లాభం గడించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.3,074.5 కోట్ల నికర లాభం గడించిన విప్రో.. గతేడాది 7.9 శాతం తగ్గింది. అలాగే విప్రో ఆదాయం కూడా 4.2 శాతం పతనమైంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.23,190.3 కోట్ల ఆదాయం లభిస్తే, 2023-24లో రూ.22,208.3 కోట్లకు పరిమితమైంది. అదే డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే విప్రో నికర లాభం రూ.2,694 కోట్లతో ఐదు శాతం, రూ.22,205 కోట్ల ఆదాయంతో 1.3 శాతం గ్రోత్ సాధించింది. విప్రో ఐటీ సర్వీసెస్ విభాగంలో ఆదాయం 2657.4 మిలియన్ డాలర్లు. గతేడాదితో పోలిస్తే 6.4 శాతం తక్కువ. మార్చి త్రైమాసికంతో పోలిస్తే స్వల్పంగా 0.1 శాతం ఎక్కువ.
విప్రో సీఈఓ శ్రీని పల్లియా మాట్లాడుతూ ‘మా పరిశ్రమకు 2023-24 సవాళ్లు మిగిల్చింది. సూక్ష్మ, ఆర్థిక పరిస్థితుల్లో అనిశ్చితి నెలకొంది. అవకాశాలపై నేను ఆశావాదంతో ఉన్నా. టెక్నాలజీకల్ షిప్ట్ వైపు మళ్లుతున్నది. మా క్లయింట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు మేం పరివర్తన చెందాల్సి ఉంది’ అని చెప్పారు. ఇటీవలే విప్రో సీఈఓగా శ్రీని పల్లియా నియమితులయ్యారు. తాజాగా విప్రో హోల్ టైం డైరెక్టర్ డిజిగ్నేటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా రిషాద్ ఏ ప్రేమ్ జీని పున: నియమించినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్లో విప్రో తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో విప్రో షేర్ శుక్రవారం రూ.452.85 వద్ద ముగిసింది.