బెంగళూరు, మార్చి 28: హిందూ ఆలయ పరిసరాల్లో ముస్లింలు వ్యాపారం చేయడానికి అనుమతి లేదన్న కర్ణాటక ప్రభుత్వ ప్రకటనను బీజేపీ నేత, ఎమ్మెల్సీ ఏహెచ్ విశ్వనాథ్ ఖండించారు. ‘ఏ దేవుడూ, ఏ మతం ఇలా చెప్పలేదు. ముస్లిం దేశాల్లో మన భారతీయులు ఎందరో ఉపాధి పొందుతున్నారు. ఆ దేశాలు మన వాళ్లను వెనక్కి పంపిస్తే ఎలా? అలా వచ్చే వాళ్లందరికీ బీజేపీ ఉద్యోగాలు ఇస్తుందా? దేశ విభజన అప్పటినుంచి ముస్లింలు ఇక్కడే జీవిస్తున్నారు. వాళ్లు కూడా భారతీయులే. రాష్ట్రంలోని ముస్లింలు కన్నడిగులు కాదా? రూ.500 పెట్టుబడితో చిరు వ్యాపారం చేస్తూ పొట్టపోసుకొంటున్నారు. దాన్ని కూడా లాగేసుకుంటారా?’ అని మండిపడ్డారు.