లక్నో, పిబ్రవరి 21: తాను మళ్లీ గెలిస్తే నియోజకవర్గంలో ముస్లిములు నుదుటున తిలకం పెట్టిస్తానని ఇటీవల వ్యాఖ్యానించిన యూపీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాఘవేంద్ర సింగ్.. తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనకు కాకుండా వేరే వాళ్లకు ఓటేసే హిందువులకు డీఎన్ఏ పరీక్ష చేయిస్తానని అన్నారు. ‘ఒక హిందూ వేరే వాళ్లకు ఓటేస్తే.. వారిలో మియాన్(ముస్లింలను కించపరిచే ప్రస్తావన) రక్తం ప్రవహిస్తున్నట్టు. అతను ద్రోహి, జైచంద్ అక్రమ సంతానం’ అంటూ తీవ్రస్థాయిలో విద్వేష వ్యాఖ్యలు చేశారు.